జగన్మోహన్ రెడ్డిది పిరికిపంద చర్య: దేవినేని

ABN , First Publish Date - 2021-03-01T19:27:31+05:30 IST

కుప్పం పర్యటనలో చంద్రబాబుకు ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పలికారని మాజీ మంత్రి దేవినేని అన్నారు.

జగన్మోహన్ రెడ్డిది  పిరికిపంద చర్య: దేవినేని

అమరావతి: కుప్పం పర్యటనలో చంద్రబాబుకు ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పలికారని మాజీ మంత్రి దేవినేని అన్నారు. చంద్రబాబు చిత్తూరు, తిరుపతి పర్యటనకు వెళ్తే ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుపెట్టుకొని... చంద్రబాబు నేల మీద కూర్చునే పరిస్థితి వైసీపీ తీసుకొచ్చిందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిది పిరికిపంద చర్య అని వ్యాఖ్యానించారు. టీ కొట్టు నడుపుకునే వ్యక్తి కార్పొరేటర్‌గా పోటీ చేయడాన్ని తట్టుకోలేని వైసీపీకి నాయకులు అతని టీ కొట్టును పడేయడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ భర్త పెద్దకర్మ అయితే ఆమెను భర్త సమాధి వద్దకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలకు ఏ విధంగా పాల్పడ్డారో, మున్సిపల్ ఎన్నికల్లో అదే విధంగా దాడులు చేసి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-03-01T19:27:31+05:30 IST