Devineni uma: సంగం పేరు మార్చడం తప్ప ఏం చేశారు?

ABN , First Publish Date - 2022-09-07T14:43:46+05:30 IST

రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు, నిర్వహణను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Devineni uma: సంగం పేరు మార్చడం తప్ప ఏం చేశారు?

అమరావతి: రాష్ట్రం (Andhrapradesh)లో ప్రాజెక్టుల నిర్మాణాలు, నిర్వహణను వైసీపీ ప్రభుత్వం (YCP Government) భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, టీడీపీ(TDP) నేత దేవినేని ఉమా (Devineni uma) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ సంగం బ్యారేజ్ (Sangam barrage) పనులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) 82% పైగా పూర్తిచేస్తే.. 40 నెలల్లో 10 శాతం పనులు కూడా పూర్తి చేయకుండా రిబ్బన్ కటింగ్ చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు, నిర్వహణను భ్రష్టు పట్టించారు. సంగం పేరు మార్చడం తప్ప ఏం చేశారు? ఎవరి హయాంలో ఎంత ఖర్చుపెట్టారో చెప్పే ధైర్యం ఉందా? సీఎం జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-09-07T14:43:46+05:30 IST