క్యాసినో, గుట్కా, మట్కా ...దేవినేని ఉమా

ABN , First Publish Date - 2022-01-28T00:51:35+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడివాడ కేసినో వ్యవహారంలో

క్యాసినో, గుట్కా, మట్కా ...దేవినేని ఉమా

నందిగామ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడివాడ కేసినో వ్యవహారంలో ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. క్యాసినో, గుట్కా, మట్కా సూత్రధారి మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. గుడివాడలో కేసినో జూదం గురించి, కేసినోపై కరపత్రాలు, ఆధారాలను గవర్నర్‌‌కు  అందించి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఫిర్యాదు చేశారన్నారు. గుడివాడలో కేసీనో భాగోతం సాక్ష్యాధారాలతో బయటపెడితే దానిపై సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. గుడివాడలో వైసీపీ విష సంస్కృతిని ప్రవేశపెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నం బియ్యం ఇస్తానన్న సన్నాసి కేసినో అడిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. క్యాసినో, గుట్కా, మట్కా మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు.


గుడివాడ కేసినో గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారన్నారు. సీఎం జగన్‌రెడ్డి అయితే అసలు పట్టించుకోవడమే లేదన్నారు. దుర్మార్గపు మంత్రిని కాపాడాలన్నదే సీఎం ఆలోచన అని ఆయన ఆరోపించారు. సాంస్కృతికంగా ప్రత్యేకమైన స్థానం ఉండి, ఎందరో మహనీయులను అందించిన గుడివాడలో విష సంస్కృతిని ప్రవేశపెట్టడం దారుణమన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-01-28T00:51:35+05:30 IST