ఈ దండయాత్ర దేనికి సంకేతం?: Devineni

ABN , First Publish Date - 2021-09-18T14:08:52+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ నేతల దాడిపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దండయాత్ర దేనికి సంకేతం?: Devineni

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ నేతల దాడిపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘15 వాహనాలతో చెక్ పోస్టులు దాటి, బారికేడ్ దిమ్మలుకూల్చి గూండాల దాడి.  ఆలస్యంగా చేరుకున్న యంత్రాంగం. గూండాలను అడ్డుకున్నటీడీపీ నేతలపై వచ్చీ రాగానే లాఠీఛార్జి. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులతో, మీ కనుసన్నల్లో జరిగిన ఈదండయాత్ర దేనికి సంకేతం?. రాష్ట్రంలో ఆటవిక పాలనకు నిదర్శనం కాదా?’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.  

Updated Date - 2021-09-18T14:08:52+05:30 IST