పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగించాలి: Dhulipalla

ABN , First Publish Date - 2022-03-03T18:40:51+05:30 IST

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటీషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత ధూళి పాళ్ళ నరేంద్రకుమార్ అన్నారు.

పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగించాలి: Dhulipalla

గుంటూరు: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటీషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత ధూళి పాళ్ళ నరేంద్రకుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలన్నారు. రాజధాని రైతులపై కక్షపూరిత చర్యలను ఆపాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును తెలుసుకుని నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణాలను పూర్తిచేయాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-03T18:40:51+05:30 IST