‘ప్రభుత్వ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయడం దారుణం’

ABN , First Publish Date - 2022-05-31T19:36:28+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేయడం దారుణమని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు.

‘ప్రభుత్వ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయడం దారుణం’

ఏలూరు: ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేయడం దారుణమని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలల స్థలాలు అమ్మడానికే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. టీడీపీ దీనిపై పోరాటం చేస్తుందని తెలిపారు. మహానాడు దెబ్బకు వైసీపీకి మతిపోయిందన్నారు. సామాజిక న్యాయ భేరీ మంత్రుల బస్సు యాత్ర మీటింగుల్లో రికార్డింగ్ పెట్టే స్థాయికి వైసీపీ దిగజారిందని గన్ని వీరాంజనేయులు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-31T19:36:28+05:30 IST