GV anjaneyulu: జగన్ పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం
ABN , First Publish Date - 2022-09-29T17:54:31+05:30 IST
జగన్ రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ సర్వ నాశనం అయ్యాయని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.
పల్నాడు: జగన్ రెడ్డి (YS Jagan mohan reddy) పాలనలో వ్యవస్థలన్నీ సర్వ నాశనం అయ్యాయని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health university) పేరు మార్పును నిరసిస్తూ వినుకొండలో చేపట్టిన రిలే నిరహార దీక్షలో ఆంజనేయులు (TDP Leader) కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కనీసం సాంప్రదాయాలను కూడా జగన్ రెడ్డి(YCP Chief) పాటించడం లేదని మండిపడ్డారు. శాఖలపై కనీస అవగాహన లేని వాళ్లు మంత్రులుగా ఉన్నారన్నారు. వైద్య శాఖపై విడదల రజనీ (Vidadala rajani)కి ఓనమాలు తెలియదని విమర్శించారు. కాలువకు - నదికి తేడా తెలియని వ్యక్తి అంబటి రాంబాబు (Ambati rambabu) అని యెద్దేవా చేశారు. గతంలో వైఎస్ (YSR), జగన్ (CM Jagan), షర్మల(Sharmila) కూడా ఒళ్లు బలిసి పాదయాత్రలు చేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కొనసాగించే వరకు పోరాటం కొనసాగుతుందని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.