Andhra news: కందుకూరులో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-07-20T15:35:14+05:30 IST
కందుకూరులో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
నెల్లూరు: కందుకూరులో టీడీపీ నేతల(TDP leaders)ను పోలీసులు హౌస్ అరెస్ట్(House arrest) చేశారు. రామాయపట్నం పోర్టు శంఖుస్థాపనకు సీఎం జగన్(Jagan) వస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. కందుకూరు సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని టీడీపీ నాయకులు భావించారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదంటూ మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, టీడీపీ ఇన్ ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.