Jawahar: జగన్కు మద్యంపై వచ్చే ఆదాయం తప్ప ప్రజల ఆరోగ్యం పట్టదు
ABN , First Publish Date - 2022-10-02T16:44:59+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మద్యంపై వచ్చే అక్రమ ఆదాయం తప్ప ప్రజల ఆరోగ్యం పట్టదని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి Jagan mohan reddy)కి మద్యంపై వచ్చే అక్రమ ఆదాయం తప్ప ప్రజల ఆరోగ్యం పట్టదని మాజీ మంత్రి జవహర్ (Jawahar) మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి (AP CM) ప్రభుత్వం అమ్ముతున్న నకిలీ మద్యం వల్ల మహిళల మాంగళ్యాలు రాలుతున్నా.. జగన్ (YCP Chief)కు చీమ కుట్టినట్టు లేదన్నారు. డిల్లీ అయిన గల్లీ అయిన మద్య కుంభకోణంలో జగన్ కుటుంబమే అని విమర్శించారు. నకిలీ మద్యానికి ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) అడ్డాగా మారిందని అన్నారు. రాష్ట్రంలో టీ దుకాణాలకన్నా వాకిన్ స్టోర్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు. మద్యం వ్యాపారం జగన్(YS Jagan mohan reddy) కనుసన్నలలో జరుగుతోందని ఆరోపించారు. ప్రజలను మత్తులో పెట్టి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం హామీ మర్చిపోండని జగన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారని జవహర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.