పిచ్చోళ్ల చేతిలో ఏపీ శాంతి భద్రతలు: జవహర్‌

ABN , First Publish Date - 2022-01-14T00:42:46+05:30 IST

ఏపీలో శాంతి భద్రతలను పిచ్చోళ్ల చేతిలో పెట్టి పోలీసులు చోద్యం చూస్తున్నారని

పిచ్చోళ్ల చేతిలో ఏపీ శాంతి భద్రతలు: జవహర్‌

అమరావతి: ఏపీలో శాంతి భద్రతలను  పిచ్చోళ్ల చేతిలో పెట్టి పోలీసులు చోద్యం చూస్తున్నారని టీడీపీ నాయకుడు జవహర్‌ ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపిన ఘటనపై ఆయన స్పందించారు. జగన్‌ నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ వైఫల్యంతో దళితులు, బడుగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపిన సంగతి తెలిసిదే. చంద్రయ్య గ్రామ సెంటర్‌లో కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం ప్రత్యర్థులు పరారయ్యారు. 

Updated Date - 2022-01-14T00:42:46+05:30 IST