రాంజీ భౌతికకాయానికి జేసీ నివాళులు
ABN , First Publish Date - 2021-03-08T19:11:49+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాగంటి రాంజీ భౌతికకాయాన్ని టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డి సందర్శించి నివాళులర్పించారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాగంటి రాంజీ భౌతికకాయాన్ని టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు దురదృష్టకరమైన రోజన్నారు. చాలా మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి బాబు కుటుంబం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని దేవుడిని ప్రార్థిస్తానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.