రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీడీపీ నేత మృతి

ABN , First Publish Date - 2021-07-27T04:32:57+05:30 IST

మండలంలోని కొండపేటకు చెందిన సీనియర్‌ నేత జింకా సుబ్బరాయుడు(63) మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీడీపీ నేత మృతి

చెన్నూరు, జూలై 26 : మండలంలోని కొండపేటకు చెందిన సీనియర్‌ నేత జింకా సుబ్బరాయుడు(63) మృతి చెందారు. ఈయన ఐదు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తిరుపతిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని శవ పరీక్ష అనంతరం కొండపేటకు తీసుకురాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బి.హరిప్రసాద్‌ సందర్శించి నివాళులర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేమని, సుబ్బరాయుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు.

Updated Date - 2021-07-27T04:32:57+05:30 IST