ప్రజలకు అంబలి పంపిణి చేస్తున్న కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2022-05-04T18:12:43+05:30 IST

వేసవి నేపథ్యంలో ప్రజలకు అంబలి పంపిణి కార్యక్రమాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం ప్రారంభించారు.

ప్రజలకు అంబలి పంపిణి చేస్తున్న కొల్లు రవీంద్ర

విజయవాడ: వేసవి నేపథ్యంలో ప్రజలకు అంబలి పంపిణి కార్యక్రమాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర అంబలిని పంపిణి  చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎండ వేడితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వేసవి కావడంతో ప్రజలకు మంచి పోషకాలు ఉన్న ద్రావకం అందించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. దాదాపు 45 రోజుల పాటు రోజుకు వెయ్యి మందికి అంబలి అందిస్తామన్నారు. కొల్లు ఫౌండేషన్ సారథ్యంలో అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కొల్లు రవీంద్ర వెల్లడించారు. 

Read more