Chandrababu రక్షణను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది: కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2022-07-22T16:32:29+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రక్షణను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Chandrababu రక్షణను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది: కొల్లు రవీంద్ర

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) రక్షణను జగన్(Jagan) ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu ravindra) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.... ప‌డ‌వ ప్ర‌మాదం పూర్తిగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యంగానే భావిస్తున్నామన్నారు. వ‌ర‌ద‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుర‌ద రాజ‌కీయం చేస్తున్నారని విమర్శించారు. వరద ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్య‌మంత్రి క‌నీస బాధ్య‌త మ‌ర‌చి వచ్చే ఎన్నికలలో ఎన్ని కుట్రలు చేసి గెలవాలని ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. కేవ‌లం నాలుగు ట‌మోటాలు, ఎర‌గ‌డ్డ‌లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఈ జగన్‌కు ఒక్క క్షణం కూడా పాలించే అర్హత లేదని కొల్లురవీంద్ర పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-22T16:32:29+05:30 IST