మత్స్యకారుల బతుకులు రోడ్డున పడేలా జీవో 217: Kollu ravindra

ABN , First Publish Date - 2022-03-19T19:58:02+05:30 IST

సీఎం జగన్ మత్స్యకారుల బతుకులు రోడ్డున పడేలా జీవో 217 తెచ్చారని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు.

మత్స్యకారుల బతుకులు రోడ్డున పడేలా జీవో 217: Kollu ravindra

నెల్లూరు: సీఎం జగన్ మత్స్యకారుల బతుకులు రోడ్డున పడేలా జీవో 217 తెచ్చారని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. చెరువుల్లో చేపలు పెంచుకుని జీవించే హక్కు లేకుండా చేశారన్నారు. నెల్లూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ అంటూ ఏపీ వ్యాప్తంగా 6వేల సొసైటీలని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆనలైన్ టెండర్ల పేరుతో మత్స్యకారుల జీవనోపాధికి గండికొడుతున్నారన్నారు. మత్స్యకారులకు గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ ఆపేసి మోసం, దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 217ని రద్దు చేయకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. 

Updated Date - 2022-03-19T19:58:02+05:30 IST