పేదలకు కరోనా చికిత్సను ఉచితంగా అందించాలి: ఎల్.రమణ
ABN , First Publish Date - 2020-08-08T19:04:02+05:30 IST
కరోనా బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాడతామని టీడీపీ నేత ఎల్.రమణ స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: కరోనా బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాడతామని టీడీపీ నేత ఎల్.రమణ స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్షాలపై పెట్టే కేసులకు భయపడేది లేదన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులపై ప్రజలకు లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు కరోనా చికిత్సను ప్రభుత్వమే ఉచితంగా అందించాలన్నారు. తలసాని లాంటి మంత్రులను కేసీఆర్ పక్కన పెట్టుకోవటం అన్యాయమని ఎల్.రమణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.