ధూళిపాళ్ల సతీమణిని ఫోన్లో పరామర్శించిన లోకేష్

ABN , First Publish Date - 2021-04-23T14:35:48+05:30 IST

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ నేపథ్యంలో ఆయన సతీమణి జ్యోతిర్మయిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు.

ధూళిపాళ్ల సతీమణిని ఫోన్లో పరామర్శించిన లోకేష్

అమరావతి: మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ నేపథ్యంలో ఆయన సతీమణి జ్యోతిర్మయిని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో 400 మంది పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించారని ఈ సందర్భంగా లోకేష్‌కు జ్యోతిర్మయి తెలిపారు. విచారణకు సిద్ధమని... అన్ని విధాలా సహకరిస్తామని చెప్పినా ఒక యుద్దవాతావరణం సృష్టించి అరెస్ట్ చేసారని ఆమె వాపోయారు. కాగా ధూళిపాళ్ల కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని లోకేష్ చెప్పారు. ధూళిపాళ్లపై పెట్టిన అక్రమ కేసుల్లో జగన్ రెడ్డికి, వైసీపీ యూనిఫామ్ వేసుకున్న కొంతమంది అధికారులకు కోర్టులో చివాట్లు ఖాయమని లోకేష్ అన్నారు.

Updated Date - 2021-04-23T14:35:48+05:30 IST