పట్నం సుబ్బయ్య మరణం విచారకరం: లోకేష్

ABN , First Publish Date - 2021-01-15T19:10:34+05:30 IST

మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాం తెలిపారు

పట్నం సుబ్బయ్య మరణం విచారకరం: లోకేష్

అమరావతి: మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలిపారు. ‘‘తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో విద్యుత్‌శాఖ, పౌరసరఫరాలశాఖలను సమర్థవంతంగా నిర్వహించిన మాజీ మంత్రి పట్నం సుబ్బయ్యగారి మరణం విచారకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని లోకేష్ తెలిపారు. 


 


Updated Date - 2021-01-15T19:10:34+05:30 IST