ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్ళు?: Lokesh

ABN , First Publish Date - 2022-04-25T18:09:22+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్ళు?: Lokesh

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్ళు అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలపడమే నేరమంటూ యూటీఎఫ్ నేతలను, సిపిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులను, ఉపాధ్యాయులను అక్రమంగా నిర్బంధించారని అన్నారు. ‘‘మరి వారం రోజుల్లో సిపిఎస్ రద్దని మాట తప్పి మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా జగన్ మోసపు రెడ్డి గారు?  ఉపాధ్యాయుల పట్ల వైసిపి ప్రభుత్వ నిర్బంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాకమ్మ కబుర్లతో మూడేళ్లు గడిపేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చెయ్యండి’’ అంటూ లోకేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-25T18:09:22+05:30 IST