-
-
Home » Andhra Pradesh » tdp leader lokesh andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
బీఫార్మసీ విద్యార్థిని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు: Lokesh
ABN , First Publish Date - 2022-05-09T18:07:52+05:30 IST
బీఫార్మసీ విద్యార్థిని తేజశ్వని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ మండిపడ్డారు.
అమరావతి: బీఫార్మసీ విద్యార్థిని తేజశ్వని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ని తప్పించే ఎత్తుగడే అని ఆరోపించారు. తమ కూతురుపై హత్యాచారం చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తే.. పోస్ట్మార్టం కాకుండానే ఆత్మహత్యగా డీఎస్పీ తేల్చేశారన్నారు. ‘‘నిన్నటి సూసైడ్ నేటి రేప్గా ఎలా మారింది జగన్రెడ్డి గారు.. మీ వాళ్లకు ఇదే అన్యాయం జరిగితే ఇలానే స్పందిస్తారా?’’ అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.