‘వైసీపీ నేతలకు ఒళ్లు బలిసి కన్నూ మిన్నూ కానరావడం లేదు’

ABN , First Publish Date - 2022-05-19T17:29:36+05:30 IST

‘‘వైసీపీ నేతలకు ఒళ్లు బలిసి కన్నూ మిన్నూ కానరావడం లేదు’’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘వైసీపీ నేతలకు ఒళ్లు బలిసి కన్నూ మిన్నూ కానరావడం లేదు’

అమరావతి: ‘‘వైసీపీ నేతలకు ఒళ్లు బలిసి కన్నూ మిన్నూ కానరావడం లేదు’’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నించిన రైతుని, రైతుని ఆపలేదని పోలీస్ అధికారిని, కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధిని నోటికొచ్చినట్టు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడటం దారుణమన్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో బ్రాహ్మణులను కించపరిచేలా ‘‘పంతులూ నీ సంగతి చూస్తా’’ అంటూ పాత్రికేయుడు గణేష్‌ను బెదిరించడం వైసీపీ నాయకుల అహంకారానికి నిదర్శనమని విమర్శలు గుప్పించారు. ఫ్రస్టేషన్‌లో మీడియా ప్రతినిధిని కులం పేరుతో దూషించడం, రైతుని బూతులు తిట్టడం, ఎస్సైని ఒరేయ్ అంటూ చిందులు తొక్కడం చూస్తుంటే.. వైసీపీ నేతలకు రోజులు దగ్గర పడినట్టే కనిపిస్తోందని లోకేష్ అన్నారు.

Updated Date - 2022-05-19T17:29:36+05:30 IST