YCP ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలి: Lokesh

ABN , First Publish Date - 2022-05-20T16:29:54+05:30 IST

ఏపీని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా వైసీపీ మాఫియా మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శలు గుప్పించారు.

YCP ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలి: Lokesh

అమరావతి: ఏపీని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా వైసీపీ మాఫియా మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారన్నారు. తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం(Subrahmanyam)ను అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు... దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందని తెలిపారు. ఎమ్మెల్సీ అనంత బాబు తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా అతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? అని నిలదీశారు. సుబ్రహ్మణ్యంని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హత్యపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-05-20T16:29:54+05:30 IST