వైసీపీ అరాచకాలకు వెల్దుర్తి ఘటన పరాకాష్ట: Lokesh

ABN , First Publish Date - 2022-06-01T19:55:43+05:30 IST

వాట్సప్ గ్రూప్ ద్వారా మూడు రోజుల పసిపాపను అమ్మకానికి పెట్టిన వైనం ఆశ్చర్యానికి గురిచేసింది.

వైసీపీ అరాచకాలకు వెల్దుర్తి ఘటన పరాకాష్ట: Lokesh

అమరావతి: వైసీపీ అరాచకాలకు వెల్దుర్తి ఘటన పరాకాష్ట అని లోకేష్(Lokesh) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కర్నూలు జిల్లా వెల్దుర్తి అనకాల వీధికి అడ్డంగా వైసీపీ నాయకుడు సమీర్ రెడ్డి(Sameer reddy) గోడ కడుతుండగా స్థానికులు అడ్డుకోవడాన్ని తట్టుకోలేక వారిపైనే దాడిచేయడం దారుణమని మండిపడ్డారు. మహిళలు, పిల్లలని చూడకుండా సీసాలు, రాళ్లతో కొట్టడం వైసీపీ నేతల రాక్షసప్రవృత్తికి నిదర్శనమన్నారు. నలుగురు నడిచే రోడ్డుకడ్డంగా గోడ కట్టడమేంట్రా గాడిదా అని ఒక్క వైసీపీ నేతయినా సమీర్ రెడ్డికి గడ్డి పెట్టగలరా? అని ప్రశ్నించారు. సినిమాల్లో విలన్ల మాదిరి వైసీపీ నేతలు రెచ్చిపోతుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం మన దౌర్భాగ్యమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-01T19:55:43+05:30 IST