వినేవాళ్లు ఏపీ జనమైతే, చెప్పేవాడు జగన్ మోసపు రెడ్డి: Lokesh

ABN , First Publish Date - 2022-06-30T18:12:11+05:30 IST

జీపీఎఫ్ ఖాతాల్లో డబ్బు మాపంపై ప్రభుత్వం చెప్పిన కారణాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు.

వినేవాళ్లు ఏపీ జనమైతే, చెప్పేవాడు జగన్ మోసపు రెడ్డి: Lokesh

అమరావతి: జీపీఎఫ్ ఖాతాల్లో డబ్బు మాపంపై ప్రభుత్వం చెప్పిన కారణాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) మండిపడ్డారు. ‘‘వినేవాళ్లు ఆంధ్రప్రదేశ్ జనమైతే, చెప్పేవాడు జగన్ మోసపు రెడ్డి. అవగాహన లేకే సీపీఎస్ రద్దు హామీ ఇచ్చామన్నారు. జీపీఎఫ్ డబ్బులు మాయం చేసి సాఫ్ట్‌వేర్ సమస్యగా చిత్రీకరిస్తున్నారు. నిధులు లేకే సచివాలయ ఉద్యోగులకు వసతి సదుపాయం రద్దు చేసాం అంటున్నారు. రేపో మాపో శనివారం సెలవు రద్దు చేసి.. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసమేనని చెబుతారు చూడండి’’ అంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-06-30T18:12:11+05:30 IST