వైసీపీ నేతల అరాచకాలకు మరో మహిళా ఉద్యోగి బలి: Lokesh
ABN , First Publish Date - 2022-07-08T17:42:29+05:30 IST
సీఎం జగన్(Jagan) అండతో వైసీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలకు మరొక గిరిజన మహిళా ఉద్యోగి బలి కావడం రాష్ట్రంలో భయానక పాలనకి అద్దం పడుతోందని
అమరావతి: సీఎం జగన్(Jagan) అండతో వైసీపీ(YCP) నేతలు సాగిస్తున్న అరాచకాలకు మరొక గిరిజన మహిళా ఉద్యోగి బలి కావడం రాష్ట్రంలో భయానక పాలనకి అద్దం పడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యకి పాల్పడిందన్నారు. ఎస్టీ మహిళా ఉద్యోగిని వేధించి బలవన్మరణానికి కారకులైన వైసీపీ నేతల్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ నుంచి భవానీ వరకూ ప్రభుత్వ ఉద్యోగుల మరణాలన్నీ వైసీపీ చేసిన హత్యలే అని ఆరోపించారు. ఈ హత్యలని తప్పుదారి పట్టిస్తూ, నిందితులైన వైసీపీ నేతలను పోలీసులు కాపాడుతున్నారని మండిపడ్డారు. అధికారులకు జగన్ రెడ్డి క్రూర పాలనలో ఇదే గతి పట్టొచ్చని హెచ్చరించారు. వైసీపీ బాధితులైన సాటి ఉద్యోగులకు అండగా నిలవాలి లోకేష్ తెలిపారు.