Lokesh comments: వైసీపీ పాలనలో నెల్లూరు నేరాలకు అడ్డాగా మారిపోయింది
ABN , First Publish Date - 2022-08-29T17:31:49+05:30 IST
వైసీపీ పాలనలో నెల్లూరు నేరాలకు అడ్డాగా మారిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శలు గుప్పించారు.
అమరావతి: వైసీపీ (YCP) పాలనలో నెల్లూరు నేరాలకు అడ్డాగా మారిపోయిందని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh)విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రోజుకో ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన కొంతమంది పోలీసులు వైసీపీ నాయకుల రాజకీయ వికృత క్రీడలో భాగస్వామ్యం అవ్వడం వలనే తరచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. నెల్లూరులో ఇంట్లోకి చొరబడిన దుండగులు అత్యంత కిరాతకంగా దంపతులు కృష్ణారావు, సునీత లను హత్య చేశారని.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. దంపతులను హత్య చేసిన వారు, వారి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ (TDP Leader) డిమాండ్ చేశారు.