Lokesh: ఛలో కావలికి బయలుదేరిన నారా లోకేష్

ABN , First Publish Date - 2022-09-07T15:24:38+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఛలో కావలికి బయలుదేరి వెళ్లారు.

Lokesh: ఛలో కావలికి బయలుదేరిన నారా లోకేష్

అమరావతి: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా  లోకేష్ (Nara Lokesh) ఛలో కావలికి బయలుదేరి వెళ్లారు. లోకేష్ వెంట  భారీగా తెలుగుదేశం ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు కావలికి బయలుదేరారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్న లోకేష్ (TDp Leader) ముసునూరు గ్రామంలో  ఎస్సీ యువకుడు  దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ దుగ్గిరాల కరుణాకర్ ఇటీవల లేఖ రాసి చనిపోయిన విషయం తెలిసిందే. కాగా... ఇటీవల లోకేష్ శ్రీకాకుళం, విశాఖ పర్యటనలను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో నేటి కావాలి పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2022-09-07T15:24:38+05:30 IST