మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు: Lokesh

ABN , First Publish Date - 2021-12-16T16:20:59+05:30 IST

సబ్జెక్ట్‌లేని సీఎం జగన మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యలు చేశారు.

మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు: Lokesh

అమరావతి: సబ్జెక్ట్‌లేని సీఎం జగన మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందన్నారు. 15 ఏళ్ళ నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్‌ఎస్‌బీసీ  మూతపడటం బాధాకరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్‌గా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్‌ఎస్‌బీసీ కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకి నిదర్శనమని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలని...  విశాఖని దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవుపలికారు. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలని లోకేష్ అన్నారు. 

Updated Date - 2021-12-16T16:20:59+05:30 IST