ఏపీ పోలీసులను చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోంది: Lokesh
ABN , First Publish Date - 2022-02-20T18:08:52+05:30 IST
ఏపీ పోలీసులను చూస్తో జాలితో కూడిన అసహ్యమేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు.
అమరావతి: ఏపీ పోలీసులను చూస్తో జాలితో కూడిన అసహ్యమేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. తమపై వైసీపీ దాడులు చేస్తున్నా, వారి అరాచకాలకు ఖాకీలు కొమ్ముకాస్తూనే ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ తొత్తులుగా మారి ప్రశ్నించే ప్రజలు - ప్రతిపక్ష టీడీపీపై దాడులకు తెగబడ్డారన్నారు. ఇన్ని చేసినా కొంతమంది పోలీసులు చివరికి వైసీపీ మూకల బాధితులవుతున్నారని తెలిపారు. విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండిపై మద్యం, బిర్యానీ పెట్టుకుని పార్టీ చేసుకోవడం బరితెగింపుని వెల్లడిస్తోందన్నారు. పోలీసులకే రక్షణలేని రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేదెవరు అంటూ లోకేష్ ప్రశ్నించారు.