
అమరావతి: రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి వైసీపీ అధినేత జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అధికారం ఇచ్చింది..కబ్జాలు, దోపీడీలు, అడ్డుపడినవారిని చంపడానికి లైసెన్సు అన్నట్టు దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్యవహారాలలో ఏర్పడిన వివాదంతో వైసీపీ నేత ఎన్. వెంకట్రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంపడం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ అరాచకాలకి పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యలు చేశారు.
జగన్రెడ్డి దిశ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించి మహిళల భద్రతకి నాది భరోసా అని మాయమాటలు చెప్పి మూడురోజులు కాలేదు... వైసీపీకి చెందిన వెంకట్రమణారెడ్డి ఓ మహిళను అత్యంత పాశవికంగా కొట్టి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ముఖ్యమంత్రి మహిళలకు మీరిచ్చే భద్రత? అని ప్రశ్నించారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే అంతమొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తుంటే..రాష్ట్ర ప్రజల ప్రాణాలకి దేవుడే దిక్కు అని లోకేష్ అన్నారు.
ఇవి కూడా చదవండి