ప్రతీ సంఘటన జగన్ రెడ్డి పతనానికి నాంది: లోకేష్

ABN , First Publish Date - 2021-03-01T17:43:55+05:30 IST

: రేణిగుంట విమనాశ్రయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రతీ సంఘటన జగన్ రెడ్డి పతనానికి నాంది: లోకేష్

అమరావతి: చిత్తూరు జిల్లాలో పర్యటించేందుకు రేణిగుంట విమనాశ్రయానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2019లో పల్నాడు వెళ్లకుండా ఇంటి గేటుకి తాళ్లు కట్టి అడ్డుపడ్డారని...2020లో విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రాకుండా చుట్టుముట్టారని... 2021లో రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో నిర్బంధించారని గుర్తుచేశారు. పిరికి పాలకుడు జగన్ రెడ్డి అరాచకాలు ఇంకెన్నాళ్లు? అని ప్రశ్నించారు. ‘‘ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లు. డెమోక్రసిని జగనోక్రసీతో అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష నేత హక్కులు హరిస్తున్న ప్రతీ సంఘటన జగన్ రెడ్డి పతనానికి నాంది కాబోతోంది’’ అంటూ లోకేష్ హెచ్చరించారు. 

Updated Date - 2021-03-01T17:43:55+05:30 IST