మహానాడు తర్వాత ప్రజల్లోకి వస్తా: Lokesh
ABN , First Publish Date - 2022-05-02T18:02:55+05:30 IST
సీమలో తాగు సాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని... అందుకే చంద్రబాబు పట్టిసీమ తీసుకొచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.
కర్నూలు: సీమలో తాగు సాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని... అందుకే చంద్రబాబు పట్టిసీమను తీసుకొచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. రూ.13 వేల కోట్లతో జలధారను తాను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చానని...కాని అది ఆపేశారని మండిపడ్డారు. మహానాడు తర్వాత తాను ప్రజల్లోకి రానున్నట్లు తెలిపారు. అప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సందర్శించడం జరుగుతుందని చెప్పారు. ‘‘మనం ఏం చేశాము... వైసీపీ వాళ్ళు ఎలా నాశనం చేశారు అనేది ప్రజలకు తెలియజేస్తాం’’ అని లోకేష్ వెల్లడించారు.