జగన్.. ఫ్లూట్ జింక ముందు ఊదు..మా ముందు కాదు: Lokesh
ABN , First Publish Date - 2022-05-28T19:20:33+05:30 IST
స్వర్గీయ ఎన్టీఆర్(NTR) శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రకాశం: స్వర్గీయ ఎన్టీఆర్(NTR) శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క చాన్స్ అని జనాన్ని నమ్మించిన జగన్(Jagan) మోసపు రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఏపీలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మహిళ హక్కులు, రక్షణ కోసం పోరాడితే తనపై రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. అక్కచెల్లెళ్లకు అండగా పసుపు జెండా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ‘‘జగన్.. ఫ్లూట్ జింక ముందు ఊదు.. మా ముందు కాదు. నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. జగన్ను సీఎం సీటు నుంచి దించే వరకు పోరాడతా’’ అని స్పష్టం చేశారు. ప్రజలపై పన్నుల భారం మోపుతూ బాదేస్తున్నారన్నారని లోకేష్ మండిపడ్డారు.