వైసీపీ అరాచక పాలనకు నిదర్శనం: మంతెన

ABN , First Publish Date - 2021-05-15T20:08:03+05:30 IST

ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. క్షత్రియులపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు

వైసీపీ అరాచక పాలనకు నిదర్శనం: మంతెన

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. క్షత్రియులపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ఎంపీ రఘురామ అరెస్ట్‌పై మంతెన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇవాళ రఘురామ కృష్ణంరాజుని అరెస్ట్ చేశారు? రేపు మరొకరిని అరెస్ట్ చేస్తారని అన్నారు. క్షత్రియులు సర్వశక్తివంతులని సమాజ సేవ చేస్తూ రాష్ట్రాభివృద్దికి పాటు పడేవాళ్లని అలాంటి వారిపై కక్ష్య సాధింపు చర్యలు సరికాదని హితవు పలికారు. క్షత్రియుల ఓర్పు సహనాన్ని పరీక్షించొద్దని రఘురామకృష్ణంరాజుపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేసి విడుదల చేయాలని, లేకపోతే తరవాత జరిగే పరిణమాలకు ప్రభుత్వమే బాధ్యత  వహించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మంతెన హెచ్చరించారు.

Updated Date - 2021-05-15T20:08:03+05:30 IST