అమరావతిపై ఎన్నో తప్పుడు ప్రచారాలు: Nakka babu

ABN , First Publish Date - 2021-10-27T19:20:16+05:30 IST

రాజధాని కోసం ఇన్ని రోజులు ఉద్యమం చేయడం దురదృష్టకరమని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు.

అమరావతిపై ఎన్నో తప్పుడు ప్రచారాలు: Nakka babu

గుంటూరు: రాజధాని కోసం ఇన్ని రోజులు ఉద్యమం చేయడం దురదృష్టకరమని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. అమరావతిపై ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. ఉద్యమాన్ని అణచడానికి ఎన్నో కుట్రలు పన్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రాజధాని మార్చమని వైసీపీ నేతలు నమ్మించారని... ఏపీ రాజధాని ఎక్కడ అంటే అయోమయ పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజధానిని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ మార్పుతోనే ఉద్యమానికి ఫలితం ఉంటుందని తెలిపారు. జగన్‌రెడ్డిని ఇంటికి సాగనంపితేనే రాజధాని ఆగుతుందని చెప్పారు. ప్రభుత్వ సొమ్ముతో పెద్ద లాయర్‌లను పెట్టి రైతులకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నారని అన్నారు. న్యాయ పోరాటం ద్వారా కూడా పూర్తి స్థాయి న్యాయం జరగదన్నారు. రాజధాని రైతులు చేపట్టే పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పాదయాత్ర విజయవంతం చేసేందుకు రాజకీయ పక్షాలు కృషి చేయాలని నక్కా ఆనంద్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-10-27T19:20:16+05:30 IST