వారిని చూసి జగన్ వెన్నులో వణుకుపుడుతోంది: Nakka Anand
ABN , First Publish Date - 2021-11-11T15:54:12+05:30 IST
అమరావతి రైతుల పాదయాత్రకు ప్రభుత్వం బయపడుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు.
గుంటూరు: అమరావతి రైతుల పాదయాత్రకు ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. వేలాదిగా మద్దతిస్తున్న ప్రజలను చూసి జగన్ రెడ్డి వెన్నులో వణుకుపుడుతోందని వ్యాఖ్యానించారు. రాజధాని గ్రామాల్లోనే ఉద్యమం ఉందన్న వైసీపీ నేతల నోళ్లు మూగబోయాయని తెలిపారు. రైతులకు సంఘీభావంగా వెళ్లే నేతలను హౌస్ అరెస్ట్లు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనపై కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన సిగ్గు రావడం లేదన్నారు. రైతుల పాదయాత్ర ఆపాలి అనుకుంటే అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని నక్కా ఆనంద బాబు డిమాండ్ చేశారు.