జగన్ రెడ్డి పాలన అంతా రైతు వ్యతిరేక మయం: Nakka Anand

ABN , First Publish Date - 2021-09-15T18:45:11+05:30 IST

జగన్ రెడ్డి పాలన అంతా రైతు వ్యతిరేక మయమని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు.

జగన్ రెడ్డి పాలన అంతా రైతు వ్యతిరేక మయం: Nakka Anand

గుంటూరు: జగన్ రెడ్డి పాలన అంతా రైతు వ్యతిరేక మయమని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. రైతులు కోలుకోలేని స్థితికి చేరుకున్నారని తెలిపారు. ఎన్నికల ముందు జగన్ అనేక బూటకపు మాటలు చెప్పారని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, రైతులు పంట కోనుగోలకు వైసీపీ నాయకులకు కమిషన్ ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఒరిగిందేమి లేదని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను వైసీపీ కేంద్రాలుగా మార్చారని విమర్శించారు. జగన్ రెడ్డి సీఎం అయ్యే రైతులు వ్యవసాయం వదిలి పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 18 రైతు కోసం భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నామని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. 

Updated Date - 2021-09-15T18:45:11+05:30 IST