ఒక్క ఛాన్స్ అంటే.. నమ్మి గెలిపిస్తే.. నట్టేట ముంచాడు: నక్కా ఆనంద్

ABN , First Publish Date - 2022-04-27T19:41:57+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు, చేష్టలకు సంబంధం లేదని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు.

ఒక్క ఛాన్స్ అంటే.. నమ్మి గెలిపిస్తే.. నట్టేట ముంచాడు: నక్కా ఆనంద్

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు, చేష్టలకు సంబంధం లేదని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన మోసాలను నిరసిస్తూ మాల మహాసేన ధర్మ పోరాట దీక్షలో నక్కా ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఒక్క ఛాన్స్ అంటే.. నమ్మి గెలిపిస్తే.. నట్టేట ముంచారని విమర్శించారు. దళిత వర్గాలను పూర్తిగా దెబ్బ కొట్టారన్నారు. రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కులను కాలరాశారని విమర్శించారు. దళితుల అభ్యన్నతి కోసం చంద్రబాబు అనేక సంక్షేమ పధకాలను అమలు చేశారని గుర్తుచేశారు. వాటన్నింటినీ పూర్తిగా రద్దు చేసి దళితులను దగా చేశారని ఆయన ఆరోపించారు. విదేశీ విద్యా, ఉపాధి కార్యక్రమాలు నిలిపివేశారని, సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారన్నారు. జగన్ చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలు, శిరో మండనం వంటి దారుణాలు చూశామన్నారు. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ప్రభుత్వం రద్దు చేసిన 27 పధకాలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జగన్ మాయ మాటలతో మోసం చేయడం మానుకోవాలన్నారు. దళితుల కోసం ఎవరేం చెశారో చర్చకు సిద్ధమని నక్కా ఆనంద బాబు సవాల్ విసిరారు. 

Updated Date - 2022-04-27T19:41:57+05:30 IST