ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని లేకుండా చేయాలని వైసీపీ సర్కార్ కుట్ర: ఆనందబాబు

ABN , First Publish Date - 2021-07-29T17:18:44+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ... దళితులకు రక్షణగా ఉన్న ఆ

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని లేకుండా చేయాలని వైసీపీ సర్కార్ కుట్ర: ఆనందబాబు

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ...  దళితులకు రక్షణగా ఉన్న ఆ చట్టాన్ని లేకుండా చేయాలని కుట్ర చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.  వైసీపీ నేతల అవినీతి, అరాచకాలపై ప్రశ్నించిన వారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ దేవినేనిని ఉమాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమే అని అన్నారు.  అనేక ఉద్యమాల పలితంగా దళితుల రక్షణ కోసం,  సమాజంలో అంటరానితనాన్ని నిరోదించేందుకు పార్లమెంట్ ఎస్సీ, ఎస్టీ చట్టం చేసిందని తెలిపారు. దళితులను వైసీపీ మొదటి నుంచి ఓట్ బ్యాంక్‌గానే చూస్తోంది తప్ప వారి హక్కులు, ప్రయోజనాలు కాపాడటంలో ఏనాడు శ్రద్ద చూపలేదని నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-07-29T17:18:44+05:30 IST