కైకలూరులో లోకేష్ పర్యటన

ABN , First Publish Date - 2020-10-26T15:28:36+05:30 IST

జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో లోకేష్‌కు టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

కైకలూరులో లోకేష్ పర్యటన

కృష్ణా: జిల్లాలోని  కైకలూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో లోకేష్‌కు టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఆపై ఎన్టీఆర్  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పందిరిపల్లి గూడెం నుండి లంక గ్రామాల వరద బాధితులను పరామర్శించేందుకు లోకేష్ బోటులో బయలుదేరి వెళ్లారు. వడ్లకూటితిప్ప, పందిరిపల్లి గూడెం, గుమ్మాలపాడు, శృంగవరపాడు గ్రామాలను పరిశీలించి.. రైతులు,ప్రజలను లోకేష్ పరామర్శించనున్నారు. 

Updated Date - 2020-10-26T15:28:36+05:30 IST