టీచర్లపై కక్ష- విద్యార్థులకి శిక్ష: Lokesh
ABN , First Publish Date - 2022-07-28T15:41:43+05:30 IST
వైసీపీ సర్కారు అనాలోచిత నిర్ణయాలపై టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమరావతి: వైసీపీ(YCP) సర్కారు అనాలోచిత నిర్ణయాలపై టీడీపీ(TDP) జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘టీచర్లపై కక్ష- విద్యార్థులకి శిక్ష’’... ఇదే వైసీపీ సర్కారు అమలు చేస్తోన్న నూతన విద్యావిధానం అని అన్నారు. ‘‘117, 128, 84, 85 జీవోలతో అస్తవ్యస్తమైన విద్యావ్యవస్థ.. గందరగోళంలో ఉపాధ్యాయులు, ఆందోళనలో విద్యార్థులు.. ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతోన్న ప్రభుత్వం. విద్యావ్యవస్థకి శాపంగా మారిన జీవోలను ఇప్పటికైనా రద్దు చేయాలి’’ అంటూ లోకేష్ డిమాండ్ చేశారు.