జగన్ రివర్స్‌ పాలనలో బాధితులపైనే అక్రమ కేసులు: లోకేష్

ABN , First Publish Date - 2022-04-27T23:01:53+05:30 IST

జగన్ రివర్స్‌ పాలనలో బాధితులపైనే అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి NARA LOKESH ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో...

జగన్ రివర్స్‌ పాలనలో బాధితులపైనే అక్రమ కేసులు: లోకేష్

అమరావతి: జగన్ రివర్స్‌ పాలనలో బాధితులపైనే అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి NARA LOKESH ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో మట్టి మాఫియాను అడ్డుకున్న REVENUE INSPECTOR అరవింద్‌పై కేసులు పెట్టడంపై ఆయన స్పందించారు.  గుడివాడలో మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్నారనే అక్కసుతో ఆర్ఐపై లంచం DEMAND చేశారని అక్రమ కేసు పెట్టారని లోకేష్‌ మండిపడ్డారు. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతియడమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. అధికారులను బెదిరించడానికి అక్రమ కేసుల విషయంలో మరోసారి కోర్టులో ప్రభుత్వం మొట్టికాయలు తినడం ఖాయమని హెచ్చరించారరు. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడుతున్న ఉద్యోగులకు TDP ఎప్పుడూ అండగా ఉంటుందని నారా లోకేష్‌ తెలిపారు. 

Updated Date - 2022-04-27T23:01:53+05:30 IST