అధికార పార్టీకి తొత్తుల్లా పోలీసుల తీరు: నజీర్

ABN , First Publish Date - 2021-09-09T14:31:10+05:30 IST

దారుణంగా హత్యకు గురైన అనూష కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించడానికి వస్తుంటే అడ్డుకోవడం ఏమిటని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ మండిపడ్డారు.

అధికార పార్టీకి తొత్తుల్లా పోలీసుల తీరు: నజీర్

విశాఖపట్నం: దారుణంగా హత్యకు గురైన అనూష కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించడానికి వస్తుంటే అడ్డుకోవడం ఏమిటని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీకి తొత్తుల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దిశా చట్టం పేరుతో మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ దిశాచట్టం అమలులో లేదని ప్రకటిస్తే ..గుంటూరు పోలీసు  మాత్రం చట్టం అమలులో ఉందని అబద్దాలు ఆడుతున్నారని నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-09-09T14:31:10+05:30 IST