జగన్ బూతుల సీఎంగా మారారు: ఎన్వీఎస్ఎస్ వర్మ
ABN , First Publish Date - 2022-04-09T18:54:33+05:30 IST
బూతుల మంత్రిలా జగన్ బూతుల సీఎంగా మారారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ ఎస్ఎన్ వర్మ అన్నారు.
కాకినాడ: బూతుల మంత్రిలా జగన్ బూతుల సీఎంగా మారారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ ఎస్ఎన్ వర్మ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం కుర్చీ అంటే ఎంతో గౌరవం.. హుందాతనంతో కూడుకున్నదని తెలిపారు. ఇంత వరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన సీఎంలు ఆ కుర్చీ హోదాను, గౌరవాన్ని కాపాడి వన్నె తెచ్చారన్నారు. కానీ జగన్ సీఎం కుర్చీ గౌరవాన్నీ పాతాళానికి దించేశారని మండిపడ్డారు. హోదా కోసం మీరు..మీ ఎంపీలు ఎం పీకారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక.. ఏం పీకలేక.. అప్పులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం ప్రజలు చేసుకున్న ఖర్మ అని అన్నారు. విద్యార్థులతో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ బూతులాడి విద్యార్థులకు ఏం సందేశం ఇచ్చినట్లు అని ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రశ్నించారు.