అశోక్ కాలిగోటికి విజయసాయి సరిపోరు: పల్లా శ్రీనివాస్

ABN , First Publish Date - 2021-06-17T18:40:30+05:30 IST

వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అశోక్ కాలిగోటికి విజయసాయి సరిపోరు: పల్లా శ్రీనివాస్

విశాఖపట్నం: వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిపై మాట్లాడే  నైతిక అర్హత విజయ సాయిరెడ్డికి లేదన్నారు. అశోక్‌పై విజయ సాయిరెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని..వాటిని ఖండిస్తున్నామని తెలిపారు. అశోక్ గాలిగోటికి విజయసాయి రెడ్డి సరిపోరని వ్యాఖ్యానించారు. ‘‘రాజుగారు భూములు తీసున్నారని మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా?... మీరు ఇప్పటికే ఘోరమైన తప్పిదాలు చేశారు’’ అని మండిపడ్డారు. మహారాజు అయినా దర్పం ప్రదర్శించని వ్యక్తి అశోక్ అని..అటువంటి వ్యక్తిపై ఆరోపణలా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఇలా మాట్లాడితే..ఉత్తరాంధ్ర ప్రజలు సహించరన్నారు. పంచగ్రామలపై ఎవరు కేసులు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాస్సాస్ ట్రస్టు, సింహాచలం భూముల విషయంలో విజయసాయిరెడ్డికి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. సింహాచలం అప్పన్న దర్శనానికి అశోక్ గజపతి వచ్చినప్పుడు అధికారులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. అధికారులు రూల్స్ పాటించాలని.. వారికి రాజకీయాలతో సంబంధం ఏంటని పల్లా శ్రీనివాసరావు నిలదీశారు. 

Updated Date - 2021-06-17T18:40:30+05:30 IST