విశాఖలో ఆక్రమణల తొలగింపు... మాజీ ఎమ్మెల్యే పల్లా నిర్మాణాలంటూ పుకార్లు

ABN , First Publish Date - 2021-06-13T14:35:53+05:30 IST

వీఎంసీ పరిధిలో ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. గాజువాక ఆటోనగర్ సమీపంలో, ఇతర ప్రాంతాల్లో అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు.

విశాఖలో ఆక్రమణల తొలగింపు... మాజీ ఎమ్మెల్యే పల్లా నిర్మాణాలంటూ పుకార్లు

విశాఖపట్నం : జీవీఎంసీ పరిధిలో ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. గాజువాక ఆటోనగర్ సమీపంలో, ఇతర ప్రాంతాల్లో అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూములకు సమీపంలో ఉన్న ప్రైవేటు వ్యక్తుల భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. తుంగలంలో 12.5 ఎకరాలు, జగ్గరాజుపేటలో 5 ఎకరాల భూమిని జీవీఎంసీ స్వాధీనం చేసుకుంది. భారీ పోలీసుల బలగాల మధ్య ఆక్రమణలను రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. అయితే పల్లా భూములు స్వాధీనం చేసుకున్నారంటూ పుకార్లు పుట్టాయి.


కాగా.. డీపీ గత కొన్ని నెలలుగా విశాఖలో ఆక్రమణల తొలగింపు వేగవంతం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు టీడీపీ సీనియర్ నాయకుల నిర్మాణాలను సైతం అధికారులు కూల్చివేసిన ఘటనలు అప్పట్లో సంచలనమయ్యాయి. ఏప్రిల్ నెలలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని జీవీఎంసీ కూల్చివేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. 

Updated Date - 2021-06-13T14:35:53+05:30 IST