వంగవీటి రాధాను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి: పరిటాల శ్రీరామ్

ABN , First Publish Date - 2022-01-03T03:25:27+05:30 IST

‘టీడీపీ నేత వంగవీటి రాధాను టచ్ చేసి చూడండి... పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. తనను..

వంగవీటి రాధాను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి: పరిటాల శ్రీరామ్

అనంతపురం: ‘టీడీపీ నేత వంగవీటి రాధాను టచ్ చేసి చూడండి... పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే వంగవీటి రాధాకు పరిటాల శ్రీరామ్ మద్దతుగా నిలిచారు. వంగవీటి రాధా టీడీపీ కుటుంబ సభ్యుడని చెప్పారు. ఆషామాషీ అనుకుంటున్నారా..  టీడీపీ కార్యకర్తలను ముట్టుకుంటే ఒకటికి పది ఉంటాయన్నారు. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. 


Updated Date - 2022-01-03T03:25:27+05:30 IST