కరోనాతో టీడీపీ నేత మృతి

ABN , First Publish Date - 2021-05-07T17:30:14+05:30 IST

బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి

కరోనాతో టీడీపీ నేత మృతి

హైదరాబాద్/మన్సూరాబాద్‌ : టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బద్దం మహేందర్‌గౌడ్‌ (38) కరోనాతో మృతి చెందాడు. మహేందర్‌గౌడ్‌కు వారం రోజుల కిందట కరోనా సోకింది. ఆరోగ్యం క్షీణించటంతో అతన్ని బీఎన్‌రెడ్డినగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గురువారం ఉదయం నాగోలులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, మహేందర్‌గౌడ్‌ కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకింది. మహేందర్‌గౌడ్‌తో పాటు అతని భార్య, పిల్లలు, తల్లి, తమ్ముడు, చెల్లెలు ఇలా అందరూ కరోనా బారిన పడ్డారు. వారు ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. భార్యాపిల్లలు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. మహేందర్‌గౌడ్‌ మృతి పట్ల టీడీపీ శ్రేణులు, అభిమానులు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-05-07T17:30:14+05:30 IST