ఓట్లు అడిగేందుకు వైసీపీకి సిగ్గులేదు: పట్టాభి

ABN , First Publish Date - 2021-03-04T17:31:53+05:30 IST

ఫింఛన్లు, ఇళ్లు కట్ చేస్తామని వైసీపీ నాయకులు బహిరంగంగా బెదిరిస్తున్నారని... ఓట్లు అడిగేందుకు వైసీపీ సిగ్గులేదని టీడీపీ నేత పట్టాబి విమర్శించారు.

ఓట్లు అడిగేందుకు వైసీపీకి సిగ్గులేదు: పట్టాభి

కర్నూలు: ఫింఛన్లు, ఇళ్లు కట్ చేస్తామని వైసీపీ నాయకులు బహిరంగంగా బెదిరిస్తున్నారని... ఓట్లు అడిగేందుకు వైసీపీకి సిగ్గులేదని టీడీపీ నేత పట్టాబి విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ భూ కబ్జాకు పాల్పడిన మంత్రి జయరాంను జగన్ నెత్తిన పెట్టుకొని మోస్తున్నాడన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన ఘనుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. అప్పుల కోసం బొచ్చు పట్టుకొని ఆర్ధిక మంత్రి తిరుగుతున్నారని యెద్దేవా చేశారు. పింఛన్లు, జీతాలు ఇవ్వలేని నాయకుడు మంత్రి బుగ్గన అని అన్నారు. రాయలసీమలో ఒక్క పని కూడా చేయని దద్దమ్మలు అని ఆయన అన్నారు. సీమ డెవలప్ మెంట్ కోసం పోస్కో స్టీల్ ప్లాంట్‌ను రాయలసీమలో ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నించారు.  రాయలసీమ ముద్దు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు అని... రాయలసీమను అన్ని రకాలుగా బాబు అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు.  ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధి కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. ఓడిపోతామనే భయంతో టీడీపీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసే సత్తా సజ్జల రామకృష్ణా రెడ్డికి లేదన్నారు. మీడియా ముందు సజ్జల విర్రవీగుతున్నాడని వ్యాఖ్యానించారు. ప్రజలు ధైర్యంగా ఓట్లు వేయాలని పట్టాభి పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-03-04T17:31:53+05:30 IST