పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పు హర్షణీయం
ABN , First Publish Date - 2021-01-22T05:48:58+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుయుక్తులు పన్నుతున్నా... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు
టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీ ప్రసాద్
కొయ్యూరు, జనవరి 21: వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుయుక్తులు పన్నుతున్నా... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత వచ్చిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీకి సహకరించడంలేదని ఆయన ఆరోపించారు. అత్యధిక పంచాయతీల్లో టీపీపీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కేడర్ను కోరారు.